- Advertisement -
ఏపీలో బూడిద మాఫియాకు వ్యతిరేకంగా వైసీపీ ఆందోళన చేపట్టింది. ఈ క్రమంలో మాజీ మంత్రి జోగి రమేష్ను అరెస్ట్ చేశారు పోలీసులు. మూలపాడులో బూడిద డంప్ను పరిశీలించేందుకు వెళ్లేందుకు జోగి రమేషణ్ సిద్ధమవగా ఆయన్ని అరెస్ట్ చేశారు పోలీసులు.
అలాగే వైసీపీ నాయకులు, కార్యకర్తలు మూలపాడుకు వెళ్లకుండా జోగి రమేష్ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. 144 సెక్షన్ అమల్లోకి తెచ్చిన పోలీసులు.. అటువైపుగా గుంపులుగా వెళ్లేందుకు ఎవరినీ అనుమతించడం లేదు.
బూడిద రవాణా ద్వారా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అక్రమార్జనకు పాల్పడుతున్నారని జోగి రమేష్ ఆరోపించారు. అక్రమ బూడిద నిల్వలను ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు.
