- Advertisement -

ఈ వారం సినిమాలు..వసూళ్ల అప్‌డేట్!

- Advertisement -

రిషబ్ శెట్టి నటించిన కాంతారా చాప్టర్ 1 భారత బాక్సాఫీస్ వద్ద ₹500 కోట్ల మైలురాయిని చేరడానికి దగ్గరగా ఉంది. అలాగే ప్రదీప్ రంగనాథన్ నటించిన డ్యూడ్ ₹10 కోట్ల అద్భుత ఓపెనింగ్‌తో మెరుస్తుండగా, ధృవ్ విక్రమ్ నటించిన బైసన్ వసూళ్లలో మాత్రం వెనుకబడి ఉంది. బాలీవుడ్ చిత్రాలు OG మరియు జాలీ ఎల్‌ఎల్‌బీ 3 మాత్రం వీకెండ్‌లో వసూళ్ల జోరు తగ్గింది.

రిషబ్ శెట్టి యొక్క కాంతారా: చాప్టర్ 1 అక్టోబర్ 2న విడుదలైంది. పాజిటివ్ టాక్ రావడంతో థియేటర్ మస్ట్-వాచ్ లిస్టులో కాంతారాను అగ్రస్థానంలో ఉంచారు ప్రేక్షకులు. అక్టోబర్ 17న దక్షిణాది చిత్రాలైన డ్యూడ్ మరియు బైసన్ కూడా విడుదలయ్యాయి. అయితే వాటి బాక్సాఫీస్ ప్రదర్శనలో భారీ వ్యత్యాసం కనిపించింది.

కాంతారా 16 రోజుల్లో ₹493.75 కోట్ల వసూళ్లను రాబట్టగా కన్నడ భాషా ఆక్యుపెన్సీ 23.51%గా నమోదైంది. ప్రదీప్ రంగనాథన్ మరియు మమిత బైజు నటించిన డ్యూడ్ ₹10 కోట్ల ఓపెనింగ్‌తో థియేటర్లలో బలమైన ఆరంభం చేసింది. పండుగ వారాంతంలో ఈ చిత్రం మరింత వేగం అందుకునే అవకాశం ఉందని అంచనా. అక్టోబర్ 17న తమిళ ఆక్యుపెన్సీ 48.85%గా నమోదైంది. కీర్తిశ్వరన్ దర్శకత్వంలో రూపొందిన ఈ రొమాంటిక్ డ్రామాలో స‌ర‌త్‌కుమార్, హృదు హారూన్, నేహా శెట్టి, రోహిణి వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -