పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా సర్దార్ గబ్బర్ సింగ్. ఈ సినిమా ఆడియోని మార్చి 12న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ సరసన కాజల్ హీరోయిన్గా నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
ఐతే ఇప్పటికే ఈ సినిమా భారీగా అమ్ముడు పోయిన విషయం తెలిసిందే. ఐతే ఈ సినిమా ఆడియో వేడుకను కోటి పాతిక లక్షలతో భారీగా చేస్తే బాగుంటుందని పవన్ సూచించాడట. ఈ ఆడియో వేడుకను చాలా గ్రాండ్గా చేయనున్నారట. ఈ వేడుకలో చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ ..ఈ ముగ్గరూ ఈ ఆడియో లాంచ్ లో మెరవనున్నారు.
ఈ ఆడియో వేడుక మెగా ఆడియో పంక్షన్ ల నిలిచిపోవాలని పవన్ ఆదేశించినట్లు సమాచారం. కాజల్తో పాటూ ఈ సినిమాలో రాయ్ లక్ష్మి ఒక ప్రత్యేక గీతంలో కనిపించనుంది. ఏప్రిల్లో ‘సర్దార్ గబ్బర్సింగ్’ చిత్రాన్ని విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. గబ్బర్ సింగ్ సినిమా ఆడియో వేడుకకు చిరంజీవి, నాగబాబు వచ్చారు ఆ సినిమా రికార్డులు సృష్టించింది. ఇప్పుడు వస్తున్న సర్దార్ గబ్బర్ సింగ్ కూడా చిరంజీవి, నాగబాబు మళ్లీ వస్తే ఈ సినిమా కూడా పక్కా హిట్ అవుతుందని అభిమానులు అంటున్నారు. సో మరో సారి పవన్ భారీ హిట్ కొడుతాడో లెదో చూడాలి మరి.