- Advertisement -
ఇండియన్ క్రికెటర్ గౌతమ్ గంభీర్ మహేంద్ర సింగ్ ధోనిపై కొన్ని ఆసక్తికరమైన వాఖ్యలు చేశాడు.ఇంగ్లండ్ గడ్డపై పేలవ ప్రదర్శనతో నిరాశపరిచిన టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని విమర్శలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ ‘ఫినిషర్’పై సోషల్ మీడియా వేదికగా అభిమానులు విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే.
తాజాగా ఈ జాబితాలో భారత వెటరన్ ఓపెనర్ గౌతమ్ గంభీర్ చేరాడు. ఎంఎస్ ధోని ఆట తీరు కారణంగానే ప్రస్తుతం జట్టుపై ఒత్తిడి పెరుగుతోందంటూ చురకలు అంటించాడు.ఇంగ్లండ్ గడ్డపై ఇటీవల ముగిసిన మూడు వన్డేల్లోనూ ధోని ఆట తీరున ఓసారి పరిశీలిస్తే.. అతను చాలా డాట్బాల్స్ ఆడిన విషయంగా స్సష్టంగా కనబడుతుందని గౌతమ్ గంభీర్ పేర్కొన్నాడు.