బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అమీషా పటేల్ తెలుగులో కూడా నటించింది.పవన్ కల్యాణ్, ఎన్టీఆర్, మహేశ్ బాబు వంటి హీరోల సరసన హీరోయిన్గా నటించింది. హీరోయిన్గా కొత్తవారు ఎంట్రీ ఇవ్వడంతో అమీషా పటేల్ ఫేడ్ అవుట్ అయింది. అయితే ఇప్పుడు ఈ హీరోయిన్ మళ్లీ వార్తల్లో నిలిచింది. అమీషా పటేల్పై చీటింగ్ కేసు నమోదైంది. తనను అమీషా పటేల్ మోసం చేసిందటూ నిర్మాత అజయ్ కుమార్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అమీషా పటేలతో పాటు ఆమె వ్యాపార భాగస్వామి కునాల్ పై కూడా రాంచీ కోర్టులో కేసు వేశాడు నిర్మాత అజయ్ కుమార్ సింగ్.
సినిమా కోసం అజయ్ వద్ద అమీషా రూ.2.5 కోట్లను అప్పుగా తీసుకుందట అమీషా పటేల్. అయితే ఆ డబ్బు తనకు తిరిగి చెల్లించలేదని అంటున్నాడు అజయ్. అమీషా, కునాల్ గత ఏడాది మార్చిలో రాంచీ వచ్చినప్పుడు తన దగ్గర రెండున్నర కోట్లు తీసుకున్నారని, తమ సినిమా జూన్ 2018లో విడుదలవుతుదని, లాభాలు వస్తాయని చెప్పి అప్పుడు తీసుకున్నారని వెల్లడించాడు.డబ్బు ఇవ్వమని అడుగుతుంటే బెదిరిస్తున్నారని అంటున్నాడ అజయ్.
మరోసారి వాళ్లను సంప్రదిస్తే డబ్బులు వెనక్కి ఇచ్చే ఉద్దేశం లేదని చెప్పారని, ప్రముఖులతో దిగిన ఫోటోలు చూపింది అమీషా తనను బెదిరించిందని వెల్లడించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మొత్తనికి ఓ వెలుగు వెలిగిన స్టార్ హీరోయిన్పై ఇలా చీటింగ్ కేసు నమోదు కావడం సంచలనంగా మారింది.
- Advertisement -
ఫోటోలు చూపించి బ్లాక్మెయిల్ చేస్తున్న హీరోయిన్
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -