Monday, May 6, 2024
- Advertisement -

నిజానికి అబద్దానికి మధ్యన ఇరుక్కున్న రాజ్ తరుణ్!

- Advertisement -

కొన్ని కొన్ని సార్లు ప్రమాదాలు ఏం కష్టాలు తీసుకొని వస్తాయి అనే విషయం మన ఊహకి కూడా అందదు. అలంటి సందర్భం లో ఇప్పుడు రాజ్ తరుణ్ ఇరుక్కున్నాడు. ఇటీవలే తను ఒక యాక్సిడెంట్ లో నుంచి బయట పడ్డాడు. రాజ్ తరుణ్ చెప్పిన దాని ప్రకారం తన కార్ కంట్రోల్ తప్పిందని, అందుకనే, వెంటనే అక్కడ నుంచి ఇంటికి వెళ్లిపోయానని చెప్పాడు.

అయితే, రాజ్ తరుణ్ అబద్దం చెప్తున్నాడని, తాగి బండి నడుపుతూ ఉన్నాడని, ఎవరూ లేరు కాబట్టి సరిపోయింది, ఎవరైనా ఉండి ఉంటె, హిట్ అండ్ రన్ కేసు అయ్యేది అని ఒక ప్రత్యక్ష సాక్షి కథనం. కానీ ఏది నిజం ఏది అబద్దం అని ఎవ్వరికీ అర్ధం కావడం లేదు.

అంతే కాకుండా రాజ్ తరుణ్ అబద్దం ఆడుతున్నాడు అని ఇప్పుడు ఒక అనవసరమైన ఇబ్బంది లో ఇరుక్కున్నాడు. నిజానికి అబద్దానికి మధ్య నలిగిపోతూ, ప్రజల్లో అనవసరం గా నెగటివ్ ఇమేజ్ ని తెచ్చుకుంటున్నాడు. అయితే ఈ సమస్య ని పరిష్కరించే క్రమం లో కూడా కాస్త వివాదాలు తలెత్తుతున్నాయి కానీ చివరికి ఏం జరుగుతుంది అనేది చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -