ధోని రిటైర్మెంట్ పై ఇంకా ఊహాగానాలు వస్తూనె ఉన్నాయి. ఇంగ్లాండ్ వేదికగా ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచకప్ తర్వాత ధోనీ రిటైర్మెంట్ ప్రకటించేస్తాడని అంతా ఊహించారు. అయితే ఇప్పటి వకురకు ధోని తన రిటైర్మెంట్ పై ఒక్క ప్రకటన కూడా చేయలేదు. తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్ గంగూలి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ధోని భవితవ్యాన్ని కోహ్లీ, సెలక్టర్లే తేల్చాలని గంగూలీ వెల్లడించాడు. ఒకవైపు ధోని భవిష్యత్తు ప్రణాళికను అతనే ఆలోచించుకోవాలని కోహ్లి, సెలక్టర్లు అంటుంటే, గంగూలీ మాత్రం అందుకు భిన్నంగా మాట్లాడాడు.సిరీస్ ఏదైనా.. జట్టు ఎంపికకి ముందు కెప్టెన్తో సెలక్టర్లు చర్చిస్తారు. కెప్టెన్ అంగీకారం లేకుండా.. జట్టులోకి కొత్త ఆటగాళ్లని ఎంపిక చేయడం, ఉన్న వాళ్లపై వేటు వేయడం సాధారణంగా జరగదన్నారు.
భారత కెప్టెన్గా పనిచేసిన సౌరవ్ గంగూలీ.. ఇప్పుడు ధోనీ రిటైర్మెంట్పై ఓ నిర్ణయం తీసుకోవాలని కెప్టెన్ విరాట్ కోహ్లీకి సూచించాడు. దక్షిణాఫ్రికాతో తాజాగా జరుగుతున్న టీ20 సిరీస్లో ధోనీని పక్కనపెట్టిన సెలక్టర్లు.. వికెట్ కీపర్గా రిషబ్ పంత్ని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇక కోచ్ పదవిపై కూడా గంగూలి స్పందించారు.ప్రస్తుతం ఉన్న కోచ్ పదవి ముగియనివ్వండి.. తర్వాత తన సంగతి చూద్దాం అంటూ గంగూలీ పేర్కొన్నాడు.