Wednesday, May 8, 2024
- Advertisement -

బాలయ్యతో మాత్ర‌మే నాకు ఒకే అంటున్న హీరోయిన్‌

- Advertisement -

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన తదుపరి సినిమా షూటింగ్ కి రెడీ అవుతున్నాడు. కె ఎస్ రవికుమార్ దర్శకత్వం లో ఈ సినిమా రానుంది. ఇప్పటికే ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఇంతకు ముందు జై సింహా అనే సినిమా వచ్చి మంచి విజయం సాధించింది.

అయితే ఈ కొత్త చిత్రం విషయానికి వస్తే, ఈ సినిమా యొక్క షూటింగ్ కి సంబందించిన మొదటి షెడ్యూల్ వచ్చే నెల 7 న మొదలు కానుంది అని తెలుస్తుంది. బాంగ్కాక్ లో సినిమా మొదటి షెడ్యూల్ మొదలు కానుంది అని తెలుస్తుంది. అయితే ఈ సినిమా లో సోనాల్ చౌహన్ ఒక హీరోయిన్ పాత్ర పోషిస్తుంది అనే ప్రచారం సాగుతుంది. ఇంతకు ముందు ఇద్దరు కలిసి లెజెండ్ సినిమా లో పని చేశారు.

అయితే ఈ సినిమా వీరు ఇద్దరికీ రెండో సినిమా కానుంది. అంతే కాకుండా వేదిక కూడా ఒక హీరోయిన్ పాత్ర చేయనుందట. తాజా సమాచారం మేరకు ఈ సినిమా లో నమిత కూడా నటించనుందట. ఈ సినిమా తో నమిత మళ్ళీ తెలుగు పరిశ్రమ లో అడుగు పెట్టనుంది అని తెలుస్తుంది. ఈ విషయానికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -