- Advertisement -
కహోనా ప్యార్ హై మూవీతో బాలీవుడ్ ఏంట్రి ఇచ్చేసింది అమీషా పటేల్. బీటౌన్ లో స్టార్ హీరోయిన్ గా సత్తా చాటింది. టాలీవుడ్ లో కూడా అగ్ర హీరోలతో జతకట్టి అదరగోట్టేసింది. గతంలో బాలకృష్ణ , పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు , ఎన్టీఆర్ లతో నటించిన ఈ భామ ఇప్పుడు ఓ చిన్న తెలుగు సినిమాలో ఐటెం భామగా కనిపించబోతుంది.
ఒకప్పుడు ఒక వెలుగు వెలిగి ఇప్పుడు ఇలా మారి అందరికి షాకిచ్చింది . పవన్ కళ్యాణ్ , మహేష్ , ఎన్టీఆర్ లతో వరుసగా సినిమాలు చేసింది కానీ తెలుగులో మాత్రం స్టార్ డం అందుకోలేక పోయింది. హిందీలోనూ ఆవకాశాలు లేవు. దీంతో హీరోయిన్ గా నటించిన అమీషా పటేల్ రిసెంట్ గా ఆకతాయి అనే మూవీలో ఐటెం సాంగ్ చేయడానికి రెడీ అయ్యిందట.. 40 ఏళ్ల వయసులోనూ హాట్ హాట్ గా చిందేలయడానికి రెడీ అయిన అమీషా పటేల్..ఇలా అయిన అవకాశలు దక్కించుకుంటుందో లేదో చూడాలి.