Thursday, May 2, 2024
- Advertisement -

నేను అలాంటి ప‌ని చేస్తే యూట్యూబ్‌లో ఎన్ని హెడ్డింగులు కనిపించేవో

- Advertisement -

యాంక‌ర్ అన‌సూయ ఈ టీవీలో ప్ర‌సార‌మ‌య్యే జ‌బ‌ర్ధ‌స్త్ క‌మెడీ షో ద్వారా బాగా పాపులారిటీని సంపాదించుకుంది.అనుసూయ సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటు త‌న లేటెస్ట్ ఫోటోల‌ను పెడుతు అభిమానుల‌ను అల‌రిస్తుంటుంది. అయితే ఈ మ‌ధ్య ఈ హాట్ బ్యూటీకి సోష‌ల్ మీడియా క‌లిసి రావ‌డం లేదు.నిన్న సాయంత్రం త‌ను బంజారాహిల్స్ రోడ్ నెంబ‌ర్ 2 దారిలో వెళుతుండ‌గా, ప‌క్క‌న కారు డ్రైవ‌ర్ చెవిలో ఇయ‌ర్ ఫోన్స్ పెట్టుకొని ఎదురుగా ఉన్న మొబైల్‌లో వీడియో చూస్తూ కారు డ్రైవ్ చేస్తున్నాడు. ఈ స‌న్నివేశాల‌ని అన‌సూయ త‌న మొబైల్ కెమెరాలో బంధించి హైద‌రాబాద్ ట్రాఫిక్ పోలీస్‌కి ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసింది.

డియ‌ర్ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్‌.. ఇలాంటి సంఘ‌ట‌న‌లు నన్ను బ‌య‌పెట్టిస్తున్నాయి. ఇంత‌క ముందు వేరే వారి త‌ప్పిదం వ‌ల‌న నేను ప్ర‌మాదానికి గుర‌య్యాను. ద‌య చేసి ఇలాంటి నిర్ల‌క్ష్య‌పు డ్రైవ‌ర్స్‌ని వ‌దలొద్దు.రోడ్స్ పై త‌మ‌కిష్ట‌మోచ్చిన‌ట్టు డ్రైవ్ చేసే వారికి ఇత‌రుల ప్రాణాలంటే లెక్క‌లేదా అని అన‌సూయ త‌న ట్వీట్‌లో తెలిపింది.అయితే ఆమె చేసిన ట్విట్‌కు పోలీసుల‌కు బ‌దులుగా నెటిజ‌న్లు స్పందించారు.పబ్లిక్ స్టంట్ కోసం అన‌సూయ ఇలా చేసింది అంటు ఆమెను ట్రోల్ చేస్తున్నారు.దీనిపై అన‌సూయ కూడా స్పందించింది.మంచి కారణంతో ఓ వీడియో పెడితే ట్రోల్‌ చేస్తున్నారు. అయినా ఫర్వాలేదు. నేనేం తప్పు చేయలేదు. నేను చేసింది సరైన పనే’ అంటూ మరో ట్వీట్‌ చేశారు.

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -