బాలీవుడ్ చిత్ర పరిశ్రమను చూస్తుంటే 2018 అసలు అచ్చి రాలేదనే చెప్పాలి. గత కొన్ని రోజులుగా జరుగుతున్న సంఘటనలను చూస్తుంటే ఇది నిజమే అని తెలుస్తుంది.గత కొన్ని రోజులుగా బాలీవుడ్ని చేదు వార్తలు వెంటాడుతున్నాయి.ఫిబ్రవరి 24న యావత్ భారతదేశ సీనీ ఇండస్ట్రీ మొత్తం శోకసంధ్రంలో మునిగిపోయింది.అలనాటి తార శ్రీదేవి దుబాయ్లో హఠాన్మరణం చెందారు. ప్రమాదవశాత్తు బాత్టబ్లోపడి ఆమె కన్నుమూశారు.ఈ వార్త విన్న తెలుగు,తమిళ ,మొదలగుని ఇండియా మొత్తం విషాదంలో నిండిపోయింది.
ఈ సంఘటన తరువాత అరుదైన వ్యాధితో బాధపడుతున్నానని నటుడు ఇర్ఫాన్ ఖాన్ ప్రకటించారు. దీని తరువాత బాలీవుడ్ అగ్ర కథానాయకుడు సల్మాన్ ఖాన్ కృష్ణ జింకలను వేటాడిన కేసులో దోషిగా జోధ్పూర్ కోర్టు గురువారం తీర్పు ఇచ్చింది. ఆయనకు 5 ఏళ్లు జైలు శిక్ష విధించింది. ఇలా వరుస సంఘటనలతో బాలీవడ్ తీవ్ర నిరాశకు లోనైంది.