బాలయ్య అభిమానులు ఎన్టీఆర్ను టార్గెట్ చేయడం ఏంటీ అనుకుంటున్నారా…? ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు ప్రీ రిలీజ్ ఈవెంట్కు ఎన్టీఆర్ కూడా హాజరైయ్యాడు. దీంతో బాలయ్య, ఎన్టీఆర్ల మధ్య గొడవలు సర్థుమణిగాయి అనుకున్నారు. అయితే బాలకృష్ణ నటించిన కథానాయకుడు సినిమా ఈ సంక్రాంతికి కానుకగా విడుదలైంది. సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో విఫలం చెందింది. పైగా బాలకృష్ణ కెరీర్లో ఇది పెద్ద డిజాస్టార్గా ప్రేక్షకులు తెల్చేశారు. సినిమా ఫలితం ఎలా ఉన్నప్పటికి సినిమాపై ఎలాంటి కామెంట్ చేయలేదు యంగ్ టైగర్ ఎన్టీఆర్.
దీంతో బాలయ్య అభిమానులు ఎన్టీఆర్ అంటే చాలు మండిపడుతున్నారు. రీసెంట్ గా ఎన్టీఆర్ 23వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్కు అన్నయ్య కల్యాణ్ రామ్తో కలిసి వెళ్లాడు ఎన్టీఆర్. అక్కడ బాధతో ఉన్న ఎన్టీఆర్ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ ఫోటోలపై బాలయ్య అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. తాత నటించిన సినిమా గురించి పట్టించుకోవు ప్రమోట్ చేయవు కానీ తాత సమాధి దగ్గరకు మాత్రం వచ్చి నాటకాలు ఆడతావు అంటూ ట్రోల్ చేస్తున్నారు. మరి దీనిపై ఎన్టీఆర్ అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి.
- Advertisement -
తాత సమాధి దగ్గర ఎన్టీఆర్ బాగానే నాటకాలు ఆడుతున్నాడట..!
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -