నందమూరి హీరో బాలకృష్ణ లేటెస్ట్ మూవీ జైసింహా రిలీజుకు సిద్ధంగా ఉంది.బాలయ్యకు సంక్రాంతి హీరోగా సెంటిమెంట్ కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది.హీరోయిన్ నయనతారతో సక్సెస్ ఫుల్ కాంబినేషన్ రిపీట్ కావడం ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్.దర్శకుడు కె.ఎస్.రవికుమార్ చాలాకాలం తరవాత డైరెక్ట్ చేసిన స్ట్రయిట్ తెలుగు సినిమా ఇదే కావడం విశేషం. ఇవ్వన్ని కలిసి జై సింహా సినిమాకు బజ్ పెంచేశాయి.
బాలయ్య లాస్ట్ సినిమా పైసా వసూల్ కొత్తగా ఉండటంతో పాటు బాలకృష్ణ కూడా చాలా కొత్తగా అభిమానులను అలరించాడు కాని కలెక్షన్లు మాత్రం అనుకున్నంత రాలేదు.దాంతో జై సింహా స్టార్ట్ చేసి చాలా తక్కువ టైంలోనే షూటింగ్ పూర్తి చేశారు. కిందటి ఏడాది సంక్రాంతికి వచ్చిన బాలయ్య సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణి రూ. 50 కోట్ల వరకు వసూళ్లు రాబట్టగలిగింది. బాలకృష్ణ కెరీర్ లోనే అత్యధికంగా వసూలైన కలెక్షన్ ఇది. ఇప్పుడు జైసింహా కూడా సంక్రాంతి సీజన్ లో వస్తోంది.
ఈ సీజన్ లో ఐదురోజుల పాటు కలెక్షన్లకు ఢోకా ఉండదనే చెప్పుకోవచ్చు. జై సింహా రూ. 27 కోట్లు రాబడితే చాలు బాలయ్య సినిమా సేఫ్ జోన్లోకి వెళ్లుతుంది.సంక్రాంతి సీజన్ కావడంతో బాలయ్యకు పెద్ద కష్టం కాకపోవచ్చు.అందులోనూ బాలయ్యకు మాస్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ అధికంగా ఉండటం సినిమాకు మరింత ప్లస్సవుతుంది. కాస్త మంచి టాక్ వస్తే టార్గెట్ మొత్తం ఈజీగానే వసూలయ్యే అవకాశముంది. సంక్రాంతికే రీలిజ్ అయిన పవన్ కళ్యాణ్ సినిమా అజ్ఞాతవాసి మిక్స్డ్ టాక్ రావడంతో బాలయ్య సినిమాపై అంచానాలు భారీగా పెరిగాయి.