Thursday, April 25, 2024
- Advertisement -

వంద కోట్ల క్లబ్‌లో పవర్ స్టార్ మూవీ

- Advertisement -

భీమ్లానాయక్ రికార్డుల మోతమోగిస్తోంది. కలెక్షన్ల వసూళ్లలో దూసుకుపోతోంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన మల్టీస్టారర్ చిత్రం ‘భీమ్లా నాయక్’. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 25న థియేటర్లలో విడుదలై సందడి చేస్తోంది. రిలీజ్ రోజు నుంచే ఈ సినిమాకు ఫ్యాన్స్ బ్రహ్మరథం పట్టారు. ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్ లోనూ కలెక్షన్లనూ ‘భీమ్లా నాయక్’ కొల్లగొడుతున్నాడు.

తొలి రోజు రూ.50 కోట్ల పైచీలుకు గ్రాస్ కలెక్షన్స్ సాధించిన ఈ చిత్రం.. ఇప్పుడు వంద కోట్ల క్లబ్ లోకి చేరింది. ఈ విషయాన్ని పలువురు టాలీవుడ్ పీఆర్ఓలు ట్వీట్ చేశారు. సినిమా ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. యూఎస్​లోనూ మూడు రోజుల్లోనే ఈ సినిమా, రెండు మిలియన్​ డాలర్ల మార్క్​ను అధిగమించింది. ఇప్పుడీ చిత్రం రూ.150 కలెక్షన్స్ వైపు దూసుకెళ్తోంది. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ గా ఈ చిత్రం రూపొందుతోంది.

ఇందులో పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి పక్కన నిత్యా మేనన్, సంయుక్తా మేనన్ లు నటిస్తున్నారు. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందించారు. ఎస్ ఎస్ తమన్ స్వరాలను సమకూర్చారు. ఈ సినిమాను సితార ఎంటర్​టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -