బిగ్బాస్ రెండో సీజన్లో మంగళవారం జరిగిన ఎపిసోడ్లో పూర్తిగా ఫ్యామిలీ ఎమోషన్ టచ్ చేశారు.90 రోజులుగా హౌస్మెట్స్ ఇంటికి ,కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటోన్న సంగతి తెలిసిందే.తాజాగా కంటెస్టెంట్స్ కోసం వారి కుటుంబ సభ్యులని హౌస్ లోకి పంపించారు బిగ్బాస్. ముందుగా సామ్రాట్ తల్లి హౌస్ లోకి వెళ్లింది. ఆమె వచ్చేసరికి ఫ్రీజ్ లో ఉన్న సామ్రాట్ తల్లిని చూసి ఎమోషనల్ అయ్యాడు.అమిత్ కోసం తన కొడుకు, భార్య వచ్చారు.
వాళ్లని చూసి అమిత్ ఎంతో ఎమోషనల్ అయ్యాడు.దీప్తి కోసం తన కొడుకు, భర్త రాగా.. ఇంతకాలానికి తన కొడుకుని చూసుకొని భావోద్వేగంతో తల్లడిల్లిపోయింది దీప్తి. తన భర్త చెప్పిన సలహాలను విని నమ్మకంతో గేమ్ ఆడతానని చెప్పింది. ఇక దీప్తి భర్త వెళ్లిపోతూ తనీష్ తో మాట్లాడే ప్రయత్నం చేశారు. కొంచె జాగ్రత్తగా గేమ్ ఆడండి అంటు చెప్పాడు దీప్తి భర్త.ఫిజికల్ గేమ్ ఆడేప్పుడు తనీష్ దీప్తితో ర్యాష్గా బిహేవ్ చేయడం మనం చూశం.ఫిజికల్గా కొంచెం చూసుకొని గేమ్ ఆడండి అంటూ తనీష్కి చెప్పారు దీప్తి భర్త.