వైవిధ్యమైన సినిమాలకు కేరాఫ్ త్రివిక్రమ్ శ్రీనివాస్. ఎప్పుడూ ప్రేక్షకులకు కొత్తదనాన్ని అందించే త్రివిక్రమ్..తన డైలాగ్లు,చక్కటి స్క్రిన్ ప్లేతో అందరిని ఇంప్రెస్ చేస్తారు. ప్రస్తుతం మహేష్తో గుంటూరు కారం సినిమా చేస్తున్నారు త్రివిక్రమ్. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకురానుంది.
ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు తన నెక్ట్స్ ప్రాజెక్టుపై దృష్టి సారించారు త్రివిక్రమ్. వాస్తవానికి మహేష్తో సినిమా కంటే ముందు బన్నీతో మూవీని ప్లాన్ చేశారు. కానీ అది పట్టాలెక్కలేదు. అయితే మహేష్తో మూవీ తర్వాత బన్నీతో మూవీ ఉంటుందని భావించినా అది సాధ్యం కాలేదు. ఎందుకంటే ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్లో బిజీగా ఉన్నారు అల్లు అర్జున్. తర్వాత సందీప్ వంగా దర్శకత్వంలో ఓ సినిమా కమిట్ అయ్యారు.
అందుకే ఈసారి మల్టీస్టారర్ మూవీతో వచ్చేందుకు రెడీ అవుతున్నారట త్రివిక్రమ్. విక్టరీ వెంకటేష్, నాని హీరోలుగా మల్టీస్టారర్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని టాక్. గతంలో వెంకీ హిట్ సినిమాలు నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాలకు మాటల రచయితగా పనిచేశారు. అందుకే వెంకీ-నానితో సినిమా ప్లాన్ చేస్తుండగా త్వరలోనే ఇందుకు సంబంధించిన అఫిషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉందట. ఏదిఏమైనా త్రివిక్రమ్ తెరకెక్కించబోయే మల్టీస్టారర్ ఇప్పుడు టీ టౌన్లో హాట్ టాపిక్గా మారింది.