టాలీవుడ్ వివాస్పద నటి శ్రీరెడ్డిపై వ్యభిచారం కేసు నమోదైంది.పూర్తి వివరాల్లోకి వెళ్తే… టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్ విషయంలో పలువురు సెలబ్రిటీల మీద సంచలన ఆరోపణలు చేసింది శ్రీరెడ్డి.ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడంతో టాలీవుడ్లో శ్రీరెడ్డిని ఎవరు పట్టించుకోవడం మానేశారు.దీంతో ఆమె కోలీవుడ్కు షిఫ్ట్ అయ్యి అక్కడ వారిపై ఆరోపణలు చేయడం మొదలు పెట్టింది.సుందర్ సి, లారెన్స్ ,ఎర్.మురుగదాస్ వంటి వారిపై సంచలన ఆరోపణలు చేసింది.దీంతో నడిగర్ సంఘం ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దిశగా అడుగులు వేస్తోంది.
ఈక్రమంలో ఆమెపై వ్యభిచారం, డబ్బు దోపిడీ వంటి ఆరోపణలతో ఇండియన్ మక్కల్ మంద్రం అనే సంస్థకు చెందిన సభ్యుడు సిటీ పోలీస్ కమీషనర్ కు కంప్లైంట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. శ్రీరెడ్డి చేస్తోన్న పనులు భారతీయ సమాజాన్ని, సంస్కృతిని అవమానించే విధంగా ఉన్నాయని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నాడు. సినిమా అవకాశాల కోసం ఆమె దర్శకులు, నటుల వద్ద పడుకున్నట్లు స్వయంగా అంగీకరిస్తుంది ఇలా చేయడం వ్యభిచారం కిందకే వస్తుందని ఐఎంఎం సభ్యుడు తెలిపాడు. ఆమెపై కేసులు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు. మరి దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.
https://www.youtube.com/watch?v=6SRTDD15uDg