Saturday, April 20, 2024
- Advertisement -

కాజల్ తర్వాత ఆ సమస్య ఎదుర్కొంటున్న త్రిష

- Advertisement -

ప్రస్తుతం తెలుగు మరియు తమిళ సినిమా పరిశ్రమ ల లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న నటుల్లో ఒకరు త్రిష. ఇంకా ఈ నటి స్టార్డం ని కొనసాగిస్తూ జనరంజకమైన సినిమాలని చేస్తూ వస్తుంది. అయితే ఈ నటి 96 ఇచ్చిన విజయం తో చాలా సంతోషం గా కొత్త సినిమాలని ఒప్పుకుంది. ఇకపోతే ప్రస్తుతం కోలీవుడ్ లో త్రిష చేతిలో దాదాపుగా ఆరు సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో ఒక సినిమా పేరు ‘పరమపదం విలయాట్టు’

ఈ సినిమా త్రిష పాత్ర చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అయితే ఈ సినిమా లో హీరోయిన్ ఏ ప్రధాన పాత్ర కావడం తో త్రిష కి ఉన్న డిమాండ్ తో త్రిష ని హీరోయిన్ గా పెట్టుకున్నారు దర్శక నిర్మాతలు. త్రిష కొన్ని యాక్షన్ సీన్ల లో కూడా నటించి ఈ సినిమా తో ప్రేక్షకులని మెప్పించనుంది. ఇక ఈ సినిమా ని ఇటీవలే నిర్మాత సెన్సార్ బోర్డు వారికి చూపించినట్లు తెలుస్తుంది. ఇదొక కుటుంబ కథా చిత్రం అని ప్రమోట్ చేసిన సినిమా యూనిట్ యు సర్టిఫికెట్ ఆశించారు. కానీ సెన్సార్‌ బోర్డు వారికి యు/ఏ సర్టిఫికెట్‌ను ఇచ్చిందని తెలుస్తోంది.

ఈ దెబ్బ తో షాక్ అయినా ఫిలిం యూనిట్ ఎలాగైనా రివ్యూ చేయించాలి అని ప్లాన్ చేస్తుంది. ఇటీవలే కాజల్ నటించిన పారిస్ పారిస్ అనే సినిమా కి కూడా ఇలాగే జరిగింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -