Sunday, May 12, 2024
- Advertisement -

భ‌ర్త ఫోన్ చెక్ చేయ‌లేదంటున్న ఐశ్వర్య రాయ్‌

- Advertisement -

మాజీ ప్ర‌పంచ సుంద‌రి ఐశ్వర్య రాయ్ గురించి మ‌నం ప్ర‌త్యేకంగా చెప్పుకొవ‌ల్సిన అవ‌స‌రం లేదు.త‌న న‌ట‌న‌, అందంతో చాలా మంది అభిమానుల‌ను సంపాదించుకుంది. ఐశ్వర్య రాయ్ వివాదాల‌కు చాలా దూరంగా ఉంటారు.బాలీవుడ్‌లో చూడముచ్చటైన జంటల్లో ఐశ్వర్య రాయ్‌, అభిషేక్‌ బచ్చన్‌ ఒకరు. ఏప్రిల్‌ 20తో వీరిద్దరి వివాహమై 11 ఏళ్లు పూర్తవుతోంది.వీరికి ఆరాద్య అనే కుమార్తె ఉంది.ఐష్ త‌మ దాంప‌త్య జీవితం గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.ఇన్నేళ్ల తమ దాంపత్య జీవితంలో అభిపై తనకు ఎప్పుడూ ఎలాంటి అనుమానాలు కలగలేదని ఐష్‌ అంటున్నారు.

విలేకరి..‘అభి ఫోన్‌ పరిశీలిస్తుంటారా?’ అని అడిగితే ఎప్పుడూ అలా చేయలేదని చెప్పారు. అభి ఫోనే కాదు తన ఇంట్లో వారి ఫోన్లు కానీ స్నేహితుల ఫోన్లు కానీ ఎప్పుడూ చెక్‌ చేయలేదని తెలిపారు. ఏప్రిల్‌ 20తో వీరిద్దరి వివాహమై 11 ఏళ్లు పూర్తవుతోంది. ప్రస్తుతం ఐష్‌ ‘ఫ్యానే ఖాన్‌’ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో అనిల్‌ కపూర్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఐష్‌కి జోడీగా రాజ్‌కుమార్‌ రావ్‌ నటిస్తున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -