Thursday, May 16, 2024
- Advertisement -

‘కాలా’ ఎఫెక్ట్‌:సెలవు ప్రకటించిన ఐటీ కంపెనీ!

- Advertisement -

రజనీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో వ‌స్తున్న సినిమా కాలా.అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని రేపు(జూన్ 7) విడుద‌ల‌కు సిద్దం అవుతుంది.ఈ నేపథ్యంలో ఓ ఐటి కంపెనీలో పనిచేసే ఉద్యోగులు చాలామంది ఆ రోజున సెలవు పెట్టయినా ‘కాలా’ సినిమా చూడాలని ఫిక్స్ అయ్యారు. ఇది గ్ర‌హించిన స‌ద‌రు ఐటి సంస్థ కాలా రిలీజ్ రోజున సెల‌వు ప్ర‌క‌టించింది.

దీంతో ర‌జ‌నీ అభిమానుల ఆనందానికి అడ్డే లేదు. ఉద్యోగుల ఆనందానికి అడ్డుపడటం మంచిది కాదనే ఉద్దేశంతోనే ఆ సంస్థ ఈ నిర్ణయం తీసుకుందట. తమ సంస్థ ఆ రోజుని సెలవుదినంగా ప్రకటించిన మాట నిజమేనని అందులో పనిచేస్తోన్న వారు అన్నారు.కేరళలోని ‘టెలిసియస్ టెక్నాలజీ’ అనే ఒక ఐటీ సంస్థ రేపు సెలవును ప్రకటించింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -