ఓ క్రేజీ కాంబినేషన్కు మరో ఆసక్తికరమైన పరిణామం జరిగింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్స్టార్ మహేశ్బాబుతో ఓ సినిమా చేస్తున్నాడనే విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం ప్రముఖ బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ కె.యు. మోహనన్ పని చేయనున్నారనే విషయం ఆసక్తికరం రేపుతోంది.
‘డాన్’, ‘తలాశ్’, ‘రయీస్’ వంటి హిందీ సినిమాలకు అద్భుతమైన విజువల్స్ అందించిన మోహనన్ మహేశ్ సినిమా కోసం పని చేయడం ప్రేక్షకులు, అభిమానుల్లో అంచనాలు పెంచేస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతి మూవీస్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో మహేశ్బాబు పక్కన పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా చేసుకుంటోంది. ఆ తర్వాత సినిమాను సెట్స్పైకి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఈ సినిమాను 2019 సంక్రాంతి లేదా వేసవిలో విడుదల చేసే అవకాశం ఉంది.
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్బాబు ‘భరత్ అనే నేను’ సినిమా షూటింగ్లో చేస్తున్నాడు. కైరా అడ్వాణీతో కలిసి నటించిన ఈ సినిమా ఏప్రిల్ 20వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తర్వాత మహేశ్బాబు వంశీ పైడిపల్లికి డేట్స్ ఇచ్చే అవకాశం ఉంది.