- Advertisement -
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ రేంజ్ పెరిగిపోయింది. బాలీవుడ్లో వార్ 2, కొరటాల దర్శకత్వంలో దేవర సినిమాతో బిజీగా ఉన్నారు. దేవర అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకురానున్న సంగతి తెలిసిందే.
ఇక ఈ రెండు ప్రాజెక్టు తర్వాత కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా అఫిషియల్గా అనౌన్స్ కాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా అప్డేట్ రానున్నట్లు తెలుస్తోంది.మే 20, 2024 న ఈ చిత్రం కి సంబందించిన అనౌన్స్ మెంట్ రానుందని టాక్ నడుస్తోంది.
ప్రశాంత్ నీల్…ప్రభాస్తో సలార్ లాంటి బ్లాక్ బాస్టర్ మూవీని అందించారు. ప్రస్తుతం సలార్ 2తో బిజీగా ఉండగా దీని తర్వాత ఎన్టీఆర్ మూవీని పట్టాలెక్కించనున్నట్లు టీ టౌన్లో టాక్ నడుస్తోంది.