లావణ్య త్రిపాఠి కెరీర్ ఒక హిట్ రెండు ఫ్లాప్లగా సాగుతుంది.ఇప్పుడు మరో కుర్ర హీరో పక్కన హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసింది.వచ్చిన ఏ అవకాశాలను వదలకుండా చేసుకుంటూ పోతుంది.దానిలో భాగంగానే సీనియర్ హీరో నాగార్జున పక్కన హీరోయిన్గా కూడా చేసింది.అదే సమయంలో నాని,వరుణ్ తేజ్,సాయి ధరమ్ తేజ్ లాంటి కుర్ర హీరోల పక్కన కూడా చేసింది.
తాజాగా క్రేజీ కుర్ర హీరో నిఖిల్ సిద్ధార్థకు ఓకె చెప్పేసింది. ‘కిర్రాక్ పార్టీ’ తర్వాత నిఖిల్ చేస్తున్న మూవీలో లావణ్య త్రిపాఠిని ఫిక్స్ చేశారు.ఈ మూవీకి వర్కింగ్ టైటిల్గా ‘ముద్ర’ అని అనుకుంటున్నారు. ఇప్పటికే హైదరాబాద్లో షూటింగ్ మొదలైంది.దీనిపై స్పందించిన లావణ్య కొన్నిసార్లు సినిమా నచ్చకపొయిన రెగ్యులర్గా సినిమాలు చేస్తుండాలి లేకపోతే అవకాశాలు రావడం లేదని పక్కన పెట్టేస్తారు.అందుకే కాంప్రమైజ్ అయి కొన్ని సినిమాలు చేస్తున్నానని తెలిపింది.