Sunday, May 19, 2024
- Advertisement -

స్వయంభూ..క్రేజీ న్యూస్!

- Advertisement -

కార్తికేయ 2 తో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న హీరో నిఖిల్. ప్రస్తుతం స్వయం భూ చిత్రంలో నటిస్తుండగా నిఖిల్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఈ సినిమా ఒకటి. లెజెండరీ యోధుడిగా నటిస్తున్న నిఖిల్…తన పాత్ర కోసం తెగ కష్టపడుతున్నారు.

నిఖిల్ కెరీర్‌లో ఇది 20వ సినిమా కాగా భరత్ కృష్ణమాచారి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్‌పై భువన్ , శ్రీకర్ ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. నిఖిల్ సరసన సంయుక్త హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక మరో హీరోయిన్‌ నభా నటేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు. కేజీఎఫ్, సలార్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమాలో ఓ భారీ యాక్షన్ సీన్ ని తెరకెక్కిస్తున్నారు. ఈ సీన్ కోసం వరల్డ్ బెస్ట్ టెక్నీషియన్స్ ని తెప్పించారని నిఖిల్ స్వయంగా ఓ పోస్టర్ షేర్ చేసి తెలిపారు. 12 రోజుల పాటు దాదాపు 700 మందితో ఏకంగా 8 కోట్లు పెట్టి ఈ యాక్షన్ సీన్ భారీగా తెరకెక్కిస్తున్నారట. ఈ క్రేజీ న్యూస్ టీ టౌన్‌లో వైరల్‌గా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -