మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన చిత్రం ఆపరేషన్ వాలెంటైన్. పుల్వామా ఎటాక్,సర్జికల్ స్ట్రైక్స్ బ్యాక్డ్రాప్లో యథార్థ ఘటనల ఆధారంగా దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ ఈ సినిమాను తెరకెక్కించగా వరుణ్ తేజ్ సరసన మానుషి చిల్లర్ హీరోయిన్గా నటించింది.
థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన వారు ఓటీటీలో చూసేయవచ్చు. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్లో ఇవాళ్టి నుండి స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు హిందీ భాషల్లో అందుబాటులో రాగా థియేటర్లలో రిలీజ్ అయిన 22 రోజుల్లోనే ఓటీటీలోకి రావడం విశేషం.
వరుణ్ కెరీర్లోనే భారీ బడ్జెట్తో తెరకెక్కగా యాక్షన్ ఎపిసోడ్స్, విజువల్స్ సూపర్బ్. అయితే బాక్సాఫీస్ వద్ద నిర్మాత భారీ నష్టాలను చవిచూశారు. ఆపరేషన్ వాలెంటైన్ తర్వాత వరుణ్ తేజ్ చేస్తున్న హై ఓల్టేజ్ చిత్రం మట్కా. కరుణ కుమార్ దర్శఖత్వంలో పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ సినిమాపై వరుణ్ భారీ ఆశలు పెట్టుకున్నారు.