ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా పనులు ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉంటాయి కాబట్టి ఈ సినిమా కథను పక్కాగా తీసేందుకు దర్శక, నిర్మాతలు శ్రద్ధ పెట్టారు. తెర వెనుక పనులన్నీ ముమ్మరంగా చేస్తున్నారు. అయితే వైఎస్సార్ పాత్ర కోసం ముందుగా అక్కినేని నాగార్జునను సంప్రదించగా అతడు నో చెప్పినట్టు సమాచారం.
అయితే ఏ పాత్రనైనా ఈజీగా.. పర్ఫెక్ట్గా చేయగల నటుడు ముమ్ముట్టి. మలయాళ సినీ పరిశ్రమలో సూపర్స్టార్గా ఎదిగిన ముమ్ముట్టికి ఈ పాత్ర వచ్చింది. అయితే ఈ పాత్ర చేయడానికి అతడు అంగీకరించినట్లు సమాచారం. ఇలాంటి నిజ జీవిత పాత్రల్ని పోషించడానికి మక్కువ చూపే మమ్ముట్టి… ఈ పాత్ర చేయడానికి ఓకే అన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు ఆసక్తికర టైటిల్ పెట్టారు.
‘యాత్ర’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారట. వైఎస్సార్ అనగానే ‘పాదయాత్ర’ గుర్తొస్తుంది. ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరు చెబితే ‘ఓదార్పు యాత్ర` గుర్తుకు వస్తుంది. అందుకే ఈ సినిమాకు ‘యాత్ర’ అనే టైటిల్ పెట్టినట్టు సమాచారం. ఈ సినిమాను ‘ఆనందో బ్రహ్మ’తో హిట్ కొట్టిన మహి రాఘవ దర్శకత్వంలో సినిమా రూపుదిద్దుకుంటోంది. మిగతా వివరాలు త్వరలో వెలువడుతాయి. ఈ సినిమాను వచ్చే ఎన్నికల నాటికి విడుదల చేయాలని ప్లాన్.