యంగ్ టైగర్ ఎన్టీఆర్ ,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన సినిమా అరవింత సమేత.పూజా హెగ్డె హీరోయిన్గా నటించిన ఈ సినిమా విడుదల రోజు సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా మొత్తానికి 150 కోట్ల గ్రాస్ ను అందుకున్నట్లు తెలుస్తోంది. వరల్డ్ వైడ్ గా ఇటీవల విడుదలైన క్లోజింగ్ లెక్కల ప్రకారం తారక్ కెరీర్ లోనే ది బెస్ట్ కలెక్షన్స్ అందుకున్న సినిమాగా ఈ చిత్రం నిలిచింది.
ఇక ఇండస్ట్రీలో టాప్ 10 లో అత్యధిక షేర్స్ అందుకున్న అరవింద 6వ స్థానంలో నిలిచింది. పలు ప్రముఖ వెబ్ సైట్ల అంచనాల ప్రకారం సినిమా 88 నుంచి 95 కోట్ల షేర్స్ ను అందుకున్నట్లు తెలుస్తోంది.ముందుగా ఓపెనింగ్స్ ను బట్టి ఫైనల్ గా షేర్స్ కలెక్షన్స్ లలో సెంచరీ కొట్టేస్తుందని అనుకున్నారు. యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ గ్రాస్ రూపంలో 150 కోట్ల మార్క్ ను క్రాస్ చేయడంతో బయ్యర్స్ దాదాపు సేఫ్ జోన్ లోకి రాగలిగారు.