నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవితంపై ఇప్పుడు సినిమాలు హాట్ టాపిక్గా మారాయి. ఆయన జీవితంపై నేనంటే నేను అని సినిమాలు తీయడానికి పలువురు ముందుకు వస్తున్నారు. అయితే దర్శకుడు రామ్గోపాల్వర్మ తాను సినిమా తీస్తానని ప్రకటించడంతో ప్రకంపనలు రేగాయి. పైగా లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే పేరు ప్రకటించి సంచలనం రేపారు. అప్పటి నుంచి ఈ సినిమాలు వివాదాస్పదమవుతూనే ఉన్నాయి. రోజురోజుకు విమర్శ, ప్రతి విమర్శలు రగులుతున్నాయి. ఓ పార్టీ వారైతే వర్మను దుమ్మెత్తిపోశారు. అయితే అతడి జీవితంపై మరో వ్యక్తి సినిమా తీయడానికి సిద్ధమయ్యాడు. దర్శకుడు కేతిరెడి్డ జగదీశ్వర్రెడ్డి లక్ష్మీస్ వీరగ్రంథం అనే సినిమాను తీస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ను ఇటీవల హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్లో లాంఛనంగా ప్రారంభించారు. అయితే ఈ సినిమా షూటింగ్ను స్వర్గీయ ఎన్టీఆర్ స్వగ్రామంలో తీయడానికి ప్రయత్నించగా ఆ గ్రామస్తులు అడ్డుకున్నారు. పైగా ఈ సినిమా తనపై తీస్తున్నారని లక్ష్మీపార్వతి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆమె నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్రెడ్డి ఆరోపిస్తున్నాడు. ఇప్పుడు ఏకంగా రక్షణ కల్పించాలని కోరుతూ కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల డీజీపీలను కలిసి కోరాడు. ఈ సినిమాను ప్రకటించిన నాటి నుంచే లక్ష్మీపార్వతి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికే తాను ఉన్నది ఉన్నట్లుగా సినిమాలో చూపిస్తానని చెబుతున్న దర్శకుడు కేతిరెడ్డి పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం కొత్త మలుపు తిరుగుతోంది.
https://www.youtube.com/watch?v=NV8IhJgz9HA