Sunday, May 19, 2024
- Advertisement -

త్రివిక్ర‌మ్ ఏంటీ ఎన్టీఆర్‌తో ఇలాంటి సినిమా చేశారు – రాజ‌మౌళి

- Advertisement -

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తాజాగా న‌టించిన చిత్రం అర‌వింద స‌మేత‌.మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా గ‌త శుక్ర‌వారం విడుద‌లైంది.తొలి ఆటతోనే ఈ సినిమా మంచి సక్సెస్ టాక్‌ను సంపాదించుకుంది. భారీ డైలాగులు, హాస్యాన్ని పక్కనబెట్టి తొలిసారి త్రివిక్రమ్ కథనే నమ్మి చేసిన ప్రయత్నానికి ప్రేక్షకులు నీరాజనం పలుకుతున్నారు.తాజాగా ఈ సినిమాపై స్పందించాడు ద‌ర్శ‌కధీరుడు రాజ‌మౌళి.

‘‘ఒక యుద్ధం ముగిసిన తరువాత ఒక ప్లాట్ పాయింట్‌తో సినిమాను నడిపించడమనేది త్రివిక్రమ్ తీసుకున్న సాహసమైన నిర్ణయమనే చెప్పాలి. అది చాలా బాగా వర్కవుట్ అయింది. ఆ సీన్‌లో తారక్ నటన చాలా కాలం గుర్తుండిపోతుంది. జగపతి బాబు గారి నటన అద్భుతం. అరవింద సమేత టీం మొత్తానికి శుభాకాంక్షలు’’ అని జక్కన్న ట్వీట్ చేశారు.ఇక సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర క‌లెక్ష‌న్ల సునామి సృష్టిస్తుంది.సినిమా మొద‌టి రోజునే 60 కోట్ల‌కు పైగా క‌లెక్ట్ చేసింద‌ని స‌మాచారం.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -