డైరెక్టర్ మణిరత్నం అంటేనే…. సౌత్ చిత్ర పరిశ్రమకు ఓ గర్వకారణం.అతను చేసే ప్రతి వెంచర్ అందరినీ అలరిస్తుంటుంది.అయితే ఇదంతా గతం .ఇపుడతని పప్పులు ఉడకడం లేదు.
గతంలో మాదిరిగా అతను ఏదనుకుంటే అది జరగడం లేదు.అయినప్పటికీ మనోడు కదలడు వదలడు అన్న చందంగా మారిపోయాడు.ఓకే బంగారం తర్వాత అతను హ్యాండిల్ చేస్తోన్న చిత్రం ప్రస్తుతం అటకెక్కేసింది.ఈ సినిమాలో చేయాల్సిన దుల్కర్ సల్మాన్ ,కీర్తి సురేష్ లు సినిమా నుంచి తప్పుకున్నారు.అదేంటి దుల్కర్ కు మణిసార్ అంతటి హిట్ ఇస్తే అతను ఎందుకు ఇలా చేసాడా అని చాలామంది కొశ్చన్ చేశారు.దాని గురించి వాకబు చేస్తే….వీరితో చేద్దామనుకున్న సినిమా కథలో సరైన తడి లేదని తెలిసిపోయింది. ఓకే బంగారం కూడా సఖి లాంటి సేఫ్ సైడ్ ఫార్మాట్ లో తీసి సక్సెస్ అయిపోయాడు.
అందుకే ఓకే బంగారం తో మణికి అంతటి హిట్ వచ్చిపడిందంటారు .లేదంటే దశాబ్దం తరువాత మణికి అస్సలు ఇలాంటి హిట్ ఎందుకొస్తుంది అనేవారు ఉన్నారు. అయినప్పటికీ…మణి ఇప్పటికీ తాను తోపునన్న ఉద్దేశ్యంలోనే ఉన్నాడట. అందుకే ఎవరితో కమిట్ అయ్యాడో వారిని మణి వదలడు,ఒక వేల వారు ఓకే అన్నా…ఏవేవో ఆలోచనలతో షూటింగ్ జాప్యం చేస్తూ….ఎంచుకున్న కథతో ముందుకు కదలడు.ఇది ప్రస్తుతం మణిరత్నం విషయంలో ప్రస్తుతం వినిపిస్తోన్న తమిళ రూమర్లు.