Sunday, May 19, 2024
- Advertisement -

ముగ్గురుంటేనే మహేష్ కు మూడ్ వస్తుందట..!

- Advertisement -

ప్రిన్స్ మహేష్ బాబుతో అడ్డాల శ్రీకాంత్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న చిత్రం బ్రహ్మోత్సవం .ఈ సినిమాలో ఇప్పటి వరకు మనకు కేవలం ఇద్దరు భామలు మాత్రమే ఉన్నారని తెలుసు.

 

అయితే సినిమాకు మరింత మసాలా దట్టించడానికి అన్నట్లుగా…. ముచ్చటగా మూడో భామను సెలెక్ట్ చేసుకున్నారు. కాజల్ ,ప్రణీత, సమంతాలు ఈ సినిమాలో మహేష్ కు మరదళ్లుగా నటించబోతున్నారు.

ఈ సినిమాలో మహేష్ కు ముగ్గురు మేనత్తలు ఉంటారు. అందుకే ఇలా తీసుకోవల్సి వచ్చిందని శ్రీకాంత్ అడ్డాల చెబుతున్నాడు. ఇక ఈ సినిమా కూడా…. సీతమ్మ వాకిట్లో  సిరిమల్లె చెట్టు మాదిరిగా ప్రారంభ ముగింపులు ఆసక్తికరంగా మలచబోతున్నాడు. సీతమ్మవాకిట్లో సినిమాను రేలంగిలో మొదలు పెట్టి భద్రాచలంలో ముగిస్తాడు. అలాగే బ్రహ్మోత్సవం చిత్రాన్ని విజయవాడలో స్టార్ట్ చేసి తిరుపతిలో కథను సుఖాంతం చేయబోతున్నాడట.

అయితే ఈ ప్రాసెస్ లో ప్రేక్షకులకు బోర్ కొట్టించకుండా ఉండడానికి అన్నట్లుగా…  మహేష్ కు మూడ్ రావాలంటే ముగ్గురుండాల్సిందే అనే నినాదాన్ని లేవనెత్తారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -