శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ‘నారప్ప’ ఇటీవల అమెజాన్ ప్రైమ్లో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. అసురన్ను చిత్రాన్ని ఉన్నదున్నట్టు దించేశారని విమర్శకులు అభిప్రాయపడ్డారు. అయినప్పటికి ప్రేక్షకుల నుంచి మాత్రం ఈ సినిమాకు మంచి ఆదరణ దక్కింది. వెంకీ నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ కుటుంబకథా చిత్రాలే.
అయితే అసురన్ లాంటి ఒక ప్రత్యేక చిత్రాన్ని రీమేక్ తీయాలని భావించినప్పుడే.. శ్రీకాంత్ అడ్డాల కూడా విభిన్నకథల కోసం ట్రై చేస్తున్నాడని అంతా భావించారు.ఇదిలా ఉంటే శ్రీకాంత్ అడ్డాల తాజాగా ఓ మల్టీస్టారర్ సినిమా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇందుకోసం కథను కూడా సిద్ధం చేసుకున్నాడట. విశ్వ నటుడు కమల్ హాసన్, విక్టరీ వెంకటేశ్తో ఈ భారీ బడ్జెట్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించాలని శ్రీకాంత్ భావిస్తున్నాడట.
గతంలో వెంకటేశ్, కమల్ హాసన్ నటించిన ఈనాడు చిత్రం మంచి పేరు తెచ్చుకున్నది. మరోసారి వీళ్లిద్దరూ కలవబోతున్నట్టు టాక్. శ్రీకాంత్ అడ్డాల చెప్పిన సబ్జెక్ట్ ఓ బడా ప్రొడ్యూసర్కు కూడా నచ్చిందట. ఇక వెంకటేశ్, కమల్ ఒప్పుకుంటే ఈ మూవీ తొందర్లోనే పట్టాలెక్కే చాన్స్ ఉంది. నిజానికి శ్రీకాంత్ అడ్డాల.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం పూర్తయిన వెంబడే.. ఈ మల్టీ స్టారర్ ప్లాన్ చేశాడట. అయితే వివిధ కారణాలతో అప్పట్లో ఈ మూవీ ఆగిపోయింది. మొత్తానికి నారప్పతో సక్సెస్ కొట్టిన శ్రీకాంత్ అడ్డాల స్పీడు మీద దూసుకెళ్తున్నాడు.
Also Read
ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ సాంగ్ లో రానా, ప్రభాస్ ప్రత్యేక ఆకర్షణ..!
20 ఏళ్ల తర్వాత ఎంట్రీ ఇస్తున్న ఒకప్పటి స్టార్ హీరోయిన్..!
సీక్రెట్ గా..స్పీడ్ గా.. కొత్త సినిమా షూటింగ్ ముగించిన మారుతి..!