బాలీవుడ్ కియారా అద్వానీ తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా మారుతుందని అందరు ఆశించారు. సీన్ కట్ చేస్తే తెలుగులో ఆమె చేతిలో ఒక్క సినిమాలో కూడా లేదు. మహేశ్ బాబు హీరోగా నటించిన భరత్ అనే నేను సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టింది కియారా. మొదటి సినిమాతోనే హిట్ను తన ఖాతాలో వేసుకుంది. తన రెండో సినిమానే రామ్ చరణ్తో నటించింది. ఇదే సమయంలో బాలీవుడ్లో ఆమె నటించిన లాస్ట్ ఆఫ్ స్టోరీస్ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఈ దశలో కియారాకు తిరుగులేదని చాలామంది అనుకున్నారు.
కాని ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయింది. కియారా అద్వానీకి చేతిలో ప్రస్తుతం ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. అల్లు అర్జున్,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో మొదట హీరోయిన్గా కియారా అద్వానీ అనుకున్నారు. కాని ఇప్పుడు ఈ సినిమాలోకి గీతా గోవిందం బ్యూటీ రష్మిక మందాన వచ్చి చేరింది. అల్లు అర్జున్ పక్కన హీరోయిన్గా రష్మికను ఎంపిక చేశాడట త్రివిక్రమ్. మొదట కియారానే అనుకున్నప్పటికి, గీతా గోవిందంలో రష్మిక యాక్టింగ్ చూసిన తరువాత ఆమె ఓటు వేశాడట మాటల మాంత్రికుడు. మొత్తనికి చేతి దాకా వచ్చిందనకున్న అవకాశం కియారాను దాటుకుని రష్మికకాకు చేరిందని తెలుస్తోంది. వినయ విధేయ రామ ఫ్లాప్ ప్రభావం అందరి కన్నా ఎక్కువుగా కియారా మీదనే ఎక్కువు పడినట్లు కనిపిస్తోంది.
- Advertisement -
కియారా అద్వానీకు షాకిచ్చికి గీతా గోవిందం బ్యూటీ
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -