Friday, May 3, 2024
- Advertisement -

పోవే పోరా యాంకర్ విష్ణు ప్రియా.. యాంకర్ ఎలా అయిందో తెలుసా..?

- Advertisement -

సినీ రంగంలో రాణించాలంటే.. ఎంతో కష్టపడాలనే విషయం అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు ఉన్న స్టార్స్ అందరు కెరీర్ స్టార్టింగ్ లో ఒక్క అవకాశం అని తిరిగినవాళ్ళే. ఇంకొందరు సినిమా కష్టాలు,సీరియల్ కష్టాలు పడి వచ్చినవారే. అయితే తెలుగులో యాంకర్స్ అనగానే మనకు ముందుగా గుర్తుచ్చేది.. సుమ, అనసుయ, రష్మీ.. బులితెరపై వీరి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

అయితే వీళ్లకి మంచి క్రేజ్ ఉన్నప్పటికి వీరికి పోటీ ఇచ్చేందుకు కొత్త కొత్త యాంకర్స్ వస్తున్నారు. వారిలో విష్ణుప్రియ ఒకరు. ఈమె ప్రస్తుతం సుడిగాలి సుధీర్ తో కలిసి పోవే పోరా ప్రోగ్రామ్ చేస్తోంది. తక్కువ కాలంలో ఈ షో ద్వారా చాలా మందిని ఆకట్టుకుంది. ఈ షోకి ముందు ఈమె సీరియల్స్,వెబ్ సిరీస్ లో నటించింది. కానీ అంతగా పేరు రాలేదు. పోవే పోరా ప్రోగ్రామ్‍తో బాగా ఫాపులర్ అయింది. తన స్పాంటేనిటితో అందరిని ఆకట్టుకుంటుంది. తనదైన స్టైల్లో హావభావాలు పలికిస్తు అటు కుర్రకారుని ఇటు పెద్దవారిని తన యాంకరింగ్ తో ఆకట్టుకుంటుంది. విష్ణు ప్రియ కి సంభందించిన ఒక న్యూస్ ఇప్పుడుసోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

అదే డబ్బుల కోసం తను భగవద్గీత చెప్పేదని.. చిననాటి నుండి తన తాతగారి దగ్గర భగవద్గీతలోని అన్ని అధ్యయనాలు నేర్చుకుంది. అవే పిల్లలకు చెప్పేది..అలా చెప్పడానికి తను ఎంత తీసుకునేది తెలుసా.. ఒక్కొక్కరి దగ్గర పదిహేను వందల రూపాయలు. అదే భగవద్గీతకి సంభందించిన కాంపిటీషన్స్ లో ,ప్రోగ్రామ్స్ లో తను బొలెడు అవార్డులు కూడా గెలుచుకుంది. ఏది ఏమైన మొత్తానికి విష్ణుప్రియ మంచి యాంకర్ గా నిరుపించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఆమె మరింత ప్రేక్షకులకు దగ్గరవ్వాలని కోరుకుందాం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -