- Advertisement -

ఎన్ని కేసులు పెట్టినా..వెనక్కి తగ్గ!

- Advertisement -

ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని రోజులు జైలులో పెట్టినా, అడుగు వెనక్కి వేయాలనే ప్రశ్నే లేదని స్పష్టంగా ప్రకటించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. తమపై రాజకీయ కక్షసాధింపుల భాగంగా కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపిస్తూ, పోరాటం మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. ప్రజల హక్కుల కోసం, న్యాయం కోసం సాగిస్తున్న ఈ ఉద్యమం ఎలాంటి ఒత్తిళ్లకూ లొంగదని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.

జగన్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నిరంతరం పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోలేదని విమర్శించారు. రైతులు, మహిళలు, యువత ఎదుర్కొంటున్న సమస్యలను ఎత్తిచూపుతూ, ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఆందోళనలు కొనసాగిస్తామని తెలిపారు.

జైలు జీవితం కూడా తమ సంకల్పాన్ని దెబ్బతీయలేదని, ప్రజల మద్దతే తమ బలం అని చెప్పారు. కూటమిని కూల్చే వరకు ఈ పోరాటం ఆగదని, ప్రజల ఆశయాల సాధనకే తమ రాజకీయ జీవితం అంకితం అని స్పష్టం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -