- Advertisement -
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పేదంత సొల్లు అని మండిపడ్డారు మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం. పవన్ను తన కూతురు క్రాంతి కలవడంపై స్పందించిన ఆయన…తన కుమార్తె, తనకు మధ్యచిచ్చు పెట్టే ప్రయత్నం చేయవద్దని ముద్రగడ పద్మనాభం అన్నారు.
గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ను గాజువాక, భీమవరంలో తన్ని తగలేశారని, ఈ ఎన్నికల్లో పిఠాపురంలోనూ పవన్ కల్యాణ్ కు ఓటమి తప్పదన్నారు. తన కుమార్తెను పవన్ కల్యాణ్ రోడ్డు మీదకు లాగారని, మీ ముగ్గురి భార్యలను జనాలకు పరిచయం చేయి అంటూ చురకలు అంటించారు.
కులాలు, కుటుంబాలు మధ్య చిచ్చు పెట్టడం నీ గురువు చంద్రబాబు చెప్పినట్లే నువ్వు నడుచుకుంటున్నావా? అని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ చంద్రబాబు చేతిలో పావుగా మారారని …పవన్ చెప్పేది సొల్లు అని, మా బతుకులు మమ్మల్ని బతకనివ్వండన్నారు. చంద్రబాబు ఎస్టేట్ లో పవన్ మేనేజర్ గా మారారన్నారు.