యూత్ సినిమాలకు గిరాకి ఉంటుందనే విషయం… అందరికీ తెలిసిందే.కాకపోతే ఆ సినిమాల్లో కమర్శియల్ ఎలిమెంట్స్ ను చొప్పించలేక పోయినపుడు…అవి తీసి కూడా ప్రొడ్యూసర్ కు పెద్దగా యూజ్ ఉండదు.అందుకే కొందరు దర్శకులు తెలివి మీరిపోతున్నారు.
యువతను పెడదోవ పట్టించడమే పనిగా పెట్టుకుంటున్నారు. యూత్ సినిమాలంటూ బూత్ సినిమాలు తీస్తూ తామేదో గొప్ప దర్శకులమన్నట్లుగా బిల్డప్ ఇస్తున్నారు.ఇవి చూసి నచ్చకనే కాబోలు ఉత్తర ప్రదేశ్ సిఎం అఖిలేష్ యాదవ్ యువతను పెడదొవ పట్టించే చిత్రాలకు చెక్ పెట్టేశాడు.యుపీలో ఆడే చిత్రాల్లో ఎట్టి పరిస్థితుల్లోను హీరోయిజం చూపించడం కోసమని చెప్పి…. హద్దులు దాటే పాత్రలు చూపించొద్దని హుకూం జారి చేశాడు.ఉదాహరణకు హీరో…. హీరోయిన్ కోసం ట్రాఫిక్ రూల్స్ దాటి పోవడం దగ్గర నుంచి రెచ్చిపోయి తాగుతూ తందనాలడడాన్ని హీరోయిజం గా చూపించొద్దని హెచ్చరిస్తున్నాడు.
మరి ఇలా వార్నింగ్ లివ్వడం రేపన్న రోజు మన కేసీఆర్ కు కూడా మొదలుపెడితే మొదట బుక్ అయ్యేది పూరి జగన్నాద్ .ఆ తరువాత లిస్ట్ లోకి వచ్చేది మారుతీనే కదా అని ఫిలింనగర్ జనాలు జోకులు పేల్చుకుంటున్నారు.