- Advertisement -
బాలకృష్ణ, నయనతార. వీరిద్దరిది సక్సెస్ ఫుల్ కాంబినేషన్. ఇంతకు ముందు వీరిద్దరు కలిసి నటించిన రెండు చిత్రాలు సింహ, శ్రీరామరాజ్యం హిట్లు కొట్టాయి. ఇప్పుడు బాలయ్య బాబు వందో చిత్రంలో హీరోయిన్ గా నయనతార ఎంపికైనట్లు సమాచారం.
బాలకృష్ణ వందో చిత్రమంటే అభిమానులకు ఎన్నో ఆశలుంటాయని, వారిని నిరుత్సాహపరచడం ఇష్టం లేకే హిట్ పెయిర్ గా ముద్రపడిన నయనతారను హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు చెబుతున్నారు.
అన్నట్లు ఈ చిత్రానికి కంచె సినిమాతో జాతీయ అవార్డు సొంతం చేసుకున్న క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనిలో ఉన్న ఈ సినిమా ఈ నెలలో షూటింగ్ ప్రారంభమవుతుంది. సంక్రాంతి పండుగకు చిత్రాన్ని విడుదల చేసే అవకాశం ఉంది.