- Advertisement -
దీపికా పడుకోనే… రణ్ వీర్ సింగ్.. బాలీవుడ్ లో కొత్త ప్రేమ జంట. చాజీరావు మస్తీనీ చిత్రం విజయాన్ని ఇవ్వడమే కాదు.. వీరిద్దరి ఏకం చేసిందని కూడా బాలీవుడ్ కోడై కూసింది. వీళ్లద్దరు కలిసి… విడివిడిగా కూడా అబ్బే అదేం లేదు.. అని చెప్పారనుకోండి.
అయినా సరే… వీళ్ల మధ్య ప్రేమ ఇంకా రీలులా కొనసాగుతోందని బాలీవుడ్ ప్రచారం. ఈ ప్రచారానికి బలాన్నిస్తూ వీరిద్దరూ ఓ పెళ్లికి కలిసి వెళ్లి ఫొటోలకు ఫోజులిచ్చారు. దీపిక తన స్నేహితురాలి పెళ్లి కోసం తల్లితో కలిసి శ్రీలంక వెళ్లింది. అక్కడికి రణ్ వీర్ కూడా వెళ్లారు.
వీరిద్దరు కలిసి ఉన్న ఫోటో ఆమె స్నేహితురాలు ట్టిట్ చేశారు. గతంలో వాలెంటైన్స్ డే కోసం టొరంటో వెళ్లిన వీళ్లిద్దరు ఇప్పుడు శ్రీలంక వెళ్లారంటే ప్రేమేనా.. కాదా.. అని చెవులు కొరుక్కుంటున్నారు.