Saturday, May 18, 2024
- Advertisement -

అనుష్కను తొడలపై మహేశ్, తివిక్రమ్ లది తప్పులేదు, అలీదే తప్పైందా?!

- Advertisement -

ఇటీవల “సైజ్ జీరో” సినిమా ఆడియో విడుదల ఫంక్షన్ లో అనుష్క తొడలపై ఆలీ కమెంట్స్ పై విమర్శలు చెలరేగుతున్నాయి. అలీ కి ఇలా అసభ్యంగా మాట్లాడటం అలవాటుగా మారిందని.. గతంలో చాలా మంది హీరోయిన్లపై ఇలా బూతు కామెంట్లు విసిరిన అలీ ఇప్పుడు అనుష్కపై తన బూతు అస్త్రాన్ని సంధించాడని.. కామెడీ పేరుతో వల్గర్ గా వ్యవహరించాడని విమర్శలు చెలరేగుతున్నాయి. ఈ విషయంలో కొంతమంది మహిళలు ఘాటుగా స్పందించడం జరిగింది. అలీపై కేసులు పెట్టాలని కూడా వారు డిమాండ్ చేశారు.

 

మరి వారి విమర్శల, హెచ్చరికల సంగతలా ఉంటే.. మరోవైపు అలీ కూడా తన మాటలను లాజికల్ గా సమర్థించుకోవడం మొదలు పెట్టినట్టుగా తెలుస్తోంది. తను మాట్లాడిన దాంట్లో తప్పేముందని.. బూతు ఏముందనేది అలీ ప్రశ్న. దీనికి ఆయన లాజిక్కులు ఆయన దగ్గరున్నాయి. అందులో ముఖ్యమైనది.. తను ఒక్కటే అనుష్క తొడల గురించి కామెంట్ చేయలేదు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, హీరో మహేశ్ లు కూడా ఇంతకు ముందు ఆమెపై బూతు కామెంట్లు వదిలారు. ఖలేజా సినిమాలో అనుష్క పిక్కల గురించి ఒక డైలాగ్ ఉంటుంది. దాన్ని రాసింది త్రివిక్రమ్ , పలికింది మహేశ్ బాబు.

 

ఆ సినిమాలో సెన్సార్ కాకుండానే ఆ డైలాగ్ వచ్చేసింది. మరి ఆ డైలాగ్ ను విని ప్రేక్షకులు కూడా ముసి ముసి నవ్వులు నవ్వుకున్నారు. అలాంటి ఇప్పుడు తను మళ్లీ అలాంటి డైలాగే పలికితే తప్పు అయ్యిందా? అని అలీ వాదిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఖలేజాలో అనుష్క పిక్కల గురించి మాట్లాడితే.. ఇప్పుడు తొడల గురించి మాట్లాడాడు అలీ. అంతే తేడా! మరి ఈ సమర్థన అందరికీ ఆమోదయోగ్యమేనా?!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -