హైదరాబాద్ నుంచి నవ్యాంధ్ర రాజధాని అమరావతికి ప్రభుత్వ కార్యాలయాల తరలింపు వ్యవహారం వేగంగా జరిగిపోతోంది. వ్యవసాయ శాఖ కార్యాలయంతో పాటు.. సిబ్బంది కూడా ఉద్విగ్న క్షణాల మధ్య.. హైదరాబాద్ వదిలి గుంటూరు చేరుకున్నారు.
వీరి బాటలో మరింత మంది నడవనున్నారు. ఇదే సమయంలో.. గుంటూరులో ఏర్పాటు కాబోతున్న, ఇప్పటికే ఏర్పాటైన ప్రభుత్వ కార్యాలయాలపై.. సోషల్ సైట్లలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది.
సోషల్ సైట్లలో ప్రచారం ప్రకారం.. గుంటూరులో ఏర్పాటైన ఆఫీసుల వివరాలు ఇలా ఉన్నాయి.
* చుట్టుగుంట సెంటర్ పాత మార్కెట్ యార్డ్ లో వ్యవసాయ, మార్కెటింగ్, ఉద్యానవన శాఖ కమిషనరేట్లు
* శ్యామలానగర్ లోని స్కైలార్క్ టవర్స్ లో సహకార శాఖ రాష్ట్ర కార్యాలయం
* ఇన్నర్ రింగ్ రోడ్డ్ అన్నపూర్ణ నగర్ లో మున్సిపల్ శాఖ రాష్ట్ర కార్యాలయం
* ఇన్నర్ రింగ్ రోడ్డ్ అగతవరప్పాడు దగ్గర ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీ కార్యాలయాలు
* కంకరగుంట గేటు దగ్గర ఇరిగేషన్ శాఖ ఎస్ఈ కార్యాలయం
* కలెక్టర్ బంగ్లా రోడ్డులోని మహిళా క్లబ్ భవనంలో ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర కార్యాలయం
* పెదకాకాని మల్లేశ్వరస్వామి దేవాలయ ఆవరణలో దేవాదాయ శాఖ కార్యాలయం
* మంగళగిరిలోని శర్మ దాబా దగ్గర ఆప్కో శాఖ రాష్ట్ర కార్యాలయం
* తాడేపల్లి మండలం ఉండవల్లిలో అటవీశాఖ రాష్ట్ర కార్యాలయం.
ఇప్పటివరకూ.. ఈ కార్యాలయాలపై సోషల్ సైట్లలో ప్రచారం జరుగుతోంది. త్వరలో మరిన్ని ప్రభుత్వ శాఖలు గుంటూరులో తమ కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉంది.