మొబైల్ ఫోన్లు వాడుతున్న వినియేగ దారులకు శుభవార్త.ఇప్పటి వరకు మనం ఎవరికి పోన్ చేసినా ఆ సంభాషనలు టెలికం కంపెనీల వద్ద రికార్డు అయ్యేవి. కాని ఇక అలాంటి భయం ఉండదు. ఎందుకంటే అందరికి త్వరలోనే శాటిలైట్ ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి.
దేశంలో అతి పెద్ద టెలికం రంగం సంస్థ అయిన బీఎస్ఎన్లు ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తోంది.ఇప్పటి వరకు ప్రభుత్వ రంగ సంస్థలు, విపత్తు నిర్వహణ సంస్థలు, పోలీసులకు మాత్రమే అందుబాటులో ఉండేలా ప్రారంభించిన శాటిలైట్ ఫోన్ సర్వీసులను మరో రెండేళ్లలో అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు.
{loadmodule mod_custom,Side Ad 1}
ప్రభుత్వ రంగ టెలికం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) ఈ శుభవార్తను చెప్పింది. శాటిలైట్ ఫోన్ సర్వీసుల కోసం ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్కు ఇప్పటికే దరఖాస్తు చేశామని, అయితే ఆ ప్రక్రియ పూర్తి అయ్యేందుకు మరో 18 నుంచి 24 నెలల వరకు సమయం పడుతుందని బీఎస్ఎన్ఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అనుపమ్ శ్రీవాస్తవ తెలిపారు. ఆ తరువాతే శాటిలైట్ ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి.
{loadmodule mod_sp_social,Follow Us}