Monday, April 29, 2024
- Advertisement -

తెలివైన కంప్యూటర్ చైనా సొంతం..!

- Advertisement -

చైనా శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే అత్యంత తేలికైన క్వాంటమ్​ కంప్యూటర్​ను రూపొందించారు. సూపర్​ కంప్యూటర్​లు సైతం వేల సంవత్సరాలు చేసే పనిని ఈ కంప్యూటర్​ సెకండ్స్​లో చేయగలదని తెలిపారు. ఇది ‘అతిపెద్ద విజయం ‘గా అభివర్ణించారు. కంప్యూటర్​ రంగంలోనే ఇది మైలురాయిగా శాస్త్రవేత్తలు తెలిపారు.

క్వాంటమ్​ కంప్యూటర్​కు ‘జియూఝాంగ్​’గా నామకరణం చేశారు. క్వాంటమ్​ కంప్యూటర్​ చేసే పని.. సంప్రదాయ కంప్యూటర్లకు సాధ్యం కాదని వివరించారు. మెటీరియల్​ సైన్స్​, కృత్రిమ మేధ, మెడిసిన్​ రంగాల్లో ఈ కంప్యూటర్​ను వినియోగించవచ్చని తెలిపారు.

జియూఝాంగ్​ ఈ పేరు చైనాకు చెందిన గణిత శాస్త్రం లోనిది. ‘గాసియన్​ బోసన్’​ అనే సంక్లిష్టమైన లెక్కను చేయటానికి ఈ కంప్యూటర్​కు కేవలం 200 సెకండ్స్ పట్టింది. అదే ఫుగాకు (ప్రపంచంలోనే వేగవంతమైన క్లాసికల్ సూపర్​ కంప్యూటర్​)కు ఈ ప్రశ్న చేయటానికి 6 వందల మిలియన్ సంవత్సరాలు పడుతుంది. గూగుల్ సంస్థ తయారు చేసిన 53-క్యూబిట్​ క్వాంటమ్​ కంప్యూటర్​ తరువాత.. గాసియన్​ బోసన్ ప్రశ్నను సెకండ్స్​లో చేసిన రెండో కంప్యూటర్​గా నిలిచింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -