వైసీపీ ఎమ్మెల్యే రోజా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పార్టీలో మహిళా ఫైర్బ్రాండ్ ముద్ర వేసుకుంది రోజరా. ఏవిషయంలోనైనా అధికార పార్టీ చేసె వ్యఖ్యలకు ధీటుగా సమాధానాలిస్తూ చుక్కలు చూపించడంలో ఆమెకు ఆమె సాటి.
రోజా పేరు ఎత్తితేనే టీడీపీ నాయకులకు తడిపి మోపెడు అవుతుందనడంలో సందేహంలేదు. సమయం,సందర్భం ఏదైనా సరే అమె దూకుడును చూస్తే పచ్చపార్టీ నేతలకు వణుకే. అయితే పైర్ బ్రాండ్గా ముద్ర పడిని రోజాకు సొంత నియేజక వర్గం నగరిలో మాత్రం ఆమెకు ఎదురు గాలులు వీస్తున్నాయి.ఎమ్మెల్యే అయిన తర్వాత నియేజక వర్గాన్ని పట్టించుకోవడంతేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సినీనటి రోజా. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చిత్తూరు జిల్లా నగరి నుంచి పోటీ చేసి టీడీపీ సీనియర్ నేత గాలిముద్దుక్రిష్ణమనాయుడుపైనే గెలుపొందారు. అయితే గెలుపొందడం ఒక్కటే ఆ తర్వాత నగరి నియోజవకర్గంలో పర్యటించింది చాలా తక్కువంటున్నారు నగరి ప్రజలు. సొంతపార్టే నేతలనుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎమ్మెల్యేగా ప్రజా సమస్యలపై దృష్టి సారించాల్సిన రోజా.. పెద్దగా నియోజవర్గంపై దృష్టిపెట్టలేదంటున్నారు. కొంతమంది వైసిపి నేతలైతే తాజాగా రోజా మా కొద్దు బాబోయ్ అంటూ ఏకంగా అధినేతకే ఫిర్యాదులు చేస్తున్నారట.
నగరి నియేజక వర్గానికి చెందిన 30 మందికిపైగా వైకాపా నేతలు హైదరాబాద్కు బయలుదేరడానికి సిద్ధమయ్యారట. రోజా విషయంపై అధినేత దృష్టికి తీసుకెళ్ళాలని, ఎమ్మెల్యేకి కావాల్సిన నిధులు వస్తున్నా సరైన పర్యవేక్షణ లేకపోవడంతో, పూర్తిస్థాయిలో రోజా దృష్టి పెట్టకపోవడంతో నియోజకవర్గ సమస్య అంతంత మాత్రంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ప్రాంతంలో వైకాపా నేతలను ప్రజలు ప్రశ్నించడంతో చేసేది లేక రోజాపైనే ఫిర్యాదు చేయడానికి సిద్ధమయ్యారట. మరోవైపు ప్రభుత్వం కూడా నగరి నియోజవర్గానికి అనుకున్నంత నిధులు కూడా ఇవ్వకపోవడంతో అభివృద్ధి కుంటుపడుతోంది.
ఎప్పుడూ జడర్ దస్ ప్రోగ్రాం,ప్రతి అధికార పర్టీని విమర్శించాలని కేటాయించే సమయంలో కొంతైనా నియేజ వర్గ సమస్యలమీద…. స్థానిక నాయకులకు కేటాయిస్తే కొంత వరకు వ్యతిరేకత తగ్గుతుంది.ఎన్నికలు సంవత్సరం ముందునుంచే హడావుడి ప్రారంభంకానుంది.మరి ఈసమయంలో నియేజక వర్గ సమస్యలమీద దృష్టి సారించకపోతే నష్టం తప్పదు.మొత్తం మీద పార్టీలో ఫైర్బ్రాండ్గా ఉన్న ఆర్కే. రోజా వ్యవహారంపై అధినేత జగన్ ఏవిధంగా స్పందింస్తారో వేచి చూడాలి.
{loadmodule mod_sp_social,Follow Us}
Also Read