Sunday, April 28, 2024
- Advertisement -

పీకేకు సరికొత్త నిర్వచనం చెప్పిన రోజా!

- Advertisement -

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ అంటే చాలు ఒంటికాలుపై లేస్తారు ఏపీ మంత్రి రోజా. చంద్రబాబను విమర్శించడం సంగతి పక్కన పెడితే పవన్‌ను మాత్రం ఓ అటాడుకోవడంలో రోజాను మించినవారే లేరని చెప్పుకోవాలి. పవన్‌ని ప్యాకేజ్ కళ్యాణ్ అన్న, చంద్రబాబు దత్తపుత్రుడు అన్న, ఆయన వ్యక్తిగత విషయాలను టార్గెట్ చేయాలన్నా రోజా తర్వాతే ఎవరైన.

తాజాగా పవన్‌ కళ్యాణ్‌(పీకే)కు సరికొత్త నిర్వచనం చెప్పారు రోజా. పీకే అంటే పిచ్చి కళ్యాణ్‌ అని….జగన్‌పై మరోసారి మాట్లాడితే పళ్లు విరగ్గొడతానని మండిపడ్డారు. పవన్ సినిమాల్లో హిట్ అయ్యారేమో కానీ రాజకీయాల్లో మాత్రం ప్యాకేజీ స్టారేనని చురకలు అంటించారు. పవన్ మాటల్లో మ్యాటర్ ఉండదు, లాజిక్ ఉండదని ఎద్దేవా చేశారు. జగన్‌కు 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, పవన్ వార్డు మెంబర్ కూడా కాదని చురకలు అంటించారు.

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో బాబు అడ్డంగా దొరికారని…చట్టం ముందు అందరూ సమానులేనని తెలిపారు రోజా. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో లోకేష్‌తో పాటు అచ్చెన్నాయుడు పాత్ర ఉందని వారు కూడా త్వరలో అరెస్ట్ కావడం ఖాయమన్నారు. బాబు కుటుంబం సానుభూతి డ్రామాలను ప్రజలు నమ్మరని…జగన్‌కు చంద్రబాబు,పవన్‌కి పోలికేంటని విమర్శలు గుప్పించారు.

ఇక రోజా చేసిన కామెంట్స్‌ పవన్ ఫ్యాన్స్‌ని కోపం తెప్పించడం ఖాయం.రోజాపై జనసేన ఏ విధంగా స్పందిస్తారో వేచిచూడాలి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -