తొలి ఒమైక్రాన్‌ మరణం ఎక్కడంటే!

ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఒమైక్రాన్‌ వేరియంట్‌ తొలి మరణం నమోదైంది. ఒమైక్రాన్‌ సోకిన వ్యక్తి ఇవాళ మరణించినట్లు బ్రిటన్‌ ప్రభుత్వం తెలిపింది. ఒమైక్రాన్‌ ఇప్పటికే దాదాపు అన్ని ఖండాలకు వ్యాప్తి చెంచింది. ఈ వైరస్‌ను ఎదుర్కునేందుకు అనేక దేశాలు తమ పౌరులకు బూస్టర్‌ డోసులు ఇవ్వడం ప్రారంభించాయి.

ఈ వేరియంట్‌ వల్ల చాలా దేశాలు లాక్‌ డౌన్‌లు, వీకెండ్‌ లాక్‌ డౌన్‌లు కొనసాగిస్తున్నాయి. ఐనా ఈ మహమ్మారీ మాత్రం ఆగడంలేదు డబ్ల్యూహెచ్‌ఓ చెప్పిన దాని కింటే వేగంగా ఈ వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. దీంతో చాలా దేశాలు విమాన సర్వీసులను సైతం నిలిపివేశాయి.

మరో వైపు వచ్చే ఏడాది ఏప్రిల్‌ నాటికి ఒమైక్రాన్‌ వల్ల ఒక్క బ్రిటన్‌లోనే 70 వేల మంది మరణిస్తారని ఓ సర్వేలో తెలింది. దీంతో అప్రమత్తమైన ఇంగ్లాండ్‌ తమ పౌరులకు బూస్టర్‌ డోస్‌ ఇవ్వడమేకాకుండా అక్కడి పబ్బులపై నిశేదం విధించింది. రానున్న రోజుల్లో దేశ వ్యాప్తంగా సంపూర్ణ లాక్‌డౌన్‌ సైతం అమలు చేస్తామని ఇంగ్లండ్ ప్రభుత్వం తెలిపింది.

ఒమిక్రాన్‌ ఎఫెక్ట్‌ వారిపైనే ఎక్కువ..!

ఆ తర్వాత భారత్‌లో తార్డ్‌ వేవ్‌?

వారణాసీలో పర్యటించిన ప్రధాని