- Advertisement -
దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 5335 కరోనా కేసులు నమెదయ్యాయి. తాజా కేసులతో కలిపి ప్రస్తుతం దేశంలో ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య 25,587కి పెరిగింది. నిన్న 4435 కరోనా కేసులు నమోదువగా.. నేడు 900 కేసులు నమోదవడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
ఇక గత 24 గంటల వ్యవధిలో కరోనా కారణంగా కేరళ, మహారాష్ట్రలో నలుగురు చొప్పున, ఢిల్లీ, చత్తీస్గఢ్, గుజరాత్, హరియాణా, కర్ణాటక, పుదుచ్ఛేరి, రాజస్థాన్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 15 మంది మృతి చెందారు. హెచ్3ఎన్2 ఇన్ ఫ్లుయంజా కేసులు వ్యాప్తి చెందడంతో భారత్లో గత కొద్దిరోజులుగా కొవిడ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్లు వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు.