అంతా ప్రశాంతంగా ఉందనుకున్న సమయంలో.. ఉన్నట్టుండిగా దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6050 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ ఉదయం ప్రకటింది. వైరస్ వల్ల తాజాగా మరో 14 మరణాలు నమోదయ్యాయి. కరోనా కేసుల వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర అప్రమత్తం అయింది.
కరోనా కేసుల పెరుగుదలకు కారణం ఒమిక్రాన్ సబ్వేరియంట్ అయిన XBB1.16 వేరియంట్ కారణం అని చెపుతున్నారు. ఢిల్లీ కరోనా కేసుల్లో 98 శాతం ఈ వేరియంట్ కేసులే ఉండటం గమనార్హం. కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్య మంత్రులతో ఈ రోజు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు.
XBB1.16 వేరియంట్ లక్షణాలు:
మొదట జ్వరం వస్తుంది. ఒకటి, రెండు రోజులు జ్వరం ఉంటుంది. గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, ఒక్కసారిగా అసౌకర్యానికి గురవడం వంటివి ఇందులోని కొన్ని లక్షణాలు. ఈ ఒమిక్రాన్ ఎక్స్బీబీ.1.16 వేరియంట్తో పెద్ద ముప్పేమీ లేదు. కానీ దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారు. శ్వాస సంబంధిత ఇబ్బందులు ఉన్నవారు, వయసు పైబడిన వారు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి.