రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న దుబ్బాక ఉపఎన్నిక ఫలితం మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఈ నెల 3న జరిగిన ఎన్నికకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కాసేపట్లో ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తిచేశారు. సిద్దిపేటలోని ఇందూర్ ఇంజినీరింగ్ కళాశాలలోని డీ బ్లాక్లో లెక్కింపు చేపట్టనున్నారు.
850 మంది సిబ్బందికి శిక్షణ పూర్తి చేశారు. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రక్రియ మొదలుపెట్టి.. 14 టేబుళ్లపై 23 రౌండ్లలో పూర్తి చేయనున్నారు. మొదట అరగంటలో పోస్టల్ బ్యాలెట్లు పూర్తి చేసి.. అనంతరం ఈవీఎంలలో పోలైన ఓట్లు గణిస్తారు.
23 రౌండ్లలో ఓట్ల లెక్కింపు.మధ్యాహ్నం ఒంటిగంటలోగా తుది ఫలితం వచ్చే అవకాశం.దుబ్బాక ఉపఎన్నికలో 82.61 శాతం పోలింగ్ నమోదు అయ్యింది.సిద్దిపేటలోని ఇందూరు ఇంజినీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు.
విడ్డూరం..జగన్ ను పొగుడుతున్న టీడీపీ ఎమెల్యే..
దుకుడు తగ్గించిన సోము వీర్రాజు కారణం ఎంటో..?