Tuesday, April 30, 2024
- Advertisement -

మోడీతో సీఎం జగన్ భేటీ..

- Advertisement -

ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు సీఎం జగన్. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానిని కలిసిన జగన్…ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, రాష్ట్రానికి ఆర్థిక సహకారం, పెండింగ్ అంశాలపై ప్రధానికి జగన్ వినతిపత్రం అందజేశారు.

దాదాపు అరగంట పాటు ఈ భేటీ జరుగగా జగన్ వినతిపత్రంపై ప్రధాని సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. తెలంగాణ నుంచి ఆంధ్రాకు రావాల్సిన విద్యుత్ బకాయిలు, కేంద్ర వాటా నుంచి ఏపీకి రావాల్సిన పన్ను చెల్లింపులు క్లియర్ చేయాలని కోరారు. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జగన్ – మోడీ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.

ఏపీకి చెందిన ప్రధాన పార్టీల నేతలు హస్తినకు క్యూ కట్టడం చర్చనీయాంశంగా మారింది. తొలుత చంద్రబాబు ఆ తర్వాత జగన్ ఇప్పుడు పవన్ హస్తిన పర్యటన హాట్ టాపిక్‌గా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -